చెఱకు తోటలు నరకటం:

పక్వానికి వచ్చిన తోటలను భూమట్టానికి దగ్గరగా నరకాలి.పురుగులు ,తెగుళ్ళు నీటిముంపు మరియు నీటి ఎద్దడికి గురైన తోటలను ముందుగా కొట్టాలి.చెఱకుచే తోటలు నరకటంలో కార్షితోటలకు ప్రాధాన్యత ఇవ్వాలి.తోటలు నరికిన 24 గంటలలోపు చెఱకు ను బెల్లం తయారికి గాని,పంచదార కర్మాగారానికి గాని పంపాలి.


వర్షాధారపు చెఱకు సాగు:

ముదురు గదల నుండి విత్తనాన్ని సేకరించి మూడు కళ్ళ ముచ్చెలు వాడాలి.నీటి ఎద్దడి కి తట్టుకోవడానికి నాటే ముందు మచ్చలను 10 శాతం సున్నపు నీటిలో ఒక గంట సేపు ముంచాలి.రెండు వరుసల మధ్య దూరం 60సెం.మీ ఉంచాలి.వరుసల మధ్య దిబ్బమీద ఎకరాకు 1.25 టన్నుల చొప్పున నాటిన మూడవరోజున,చెఱకు చెత్త కప్పాలి. నాటే ముందు కాలువల్లో ఎకరాకు 10 కిలోల చొప్పున లిండేస్ పొడి మందును చల్లాలి.జూన్-జూలై నెలలో నాటిన తోటకు ఎకరాకు 60 కిలోల యూరియాను రెండు సమాధాగాలుగా చేసి రెండు నేలలలోపు వేయాలి.

ఎకరాకు 125 కిలోల సింగల్ సూపర్ ఫాస్ఫేటు ఆఖరి దుక్కిలో వేయాలి.35 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్ రెండు సమభాగాలుగా చేసి ఆఖరి దుక్కిలో సగం,ఆఖరు వర్షాలకు ముందు (అక్టోబర్ నెలాఖరు)సగం వేసుకోవాలి.జనవరి-ఫిబ్రవరిలో నాటిన తోటలకు 100 కిలోల యూరియాను మూడు నెలల లోపు రెండు సమభాగాలుగా వేయాలి.మొదటి విడత నత్రజని తో పాటు ఎకరాకు 48 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్ వేయాలి.జీవ తడి ఇచ్చిన తర్వాత .ఒకతడి ఇచ్చేందుకు మాత్రమే నీరు ఉంటె,జీవతడి పెట్టిన 30 వ రోజున ,రెండుసార్లు తడిపెట్టేందుకు నీరు వుంటే,జీవతడి ఇచ్చిన 20,60 రోజున నీటి తడి ఇవ్వాలి.తీవ్ర వర్షాభావ పరిస్థితులలో 25గ్రా యూరియా+25గ్రాల మ్యురేట్ ఆఫ్ పోటాష్ ను నీటికి కలిపి పైరు మీద పిచికారి చేయాలి.ఆలస్యంగా చెఱకును నరికే తోటలకు ఆఖరి వర్షాలలో 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ వేసి వర్షాకాలం తర్వాత ముదిరిన ,ఎండిపోయిన ఆకులను రాల్చి ఆ చెఱకు చెత్తను భూమి మీద కప్పాలి.


అంతర పంటల సాగు:

చెఱులో అంతర పంటలుగా పెసర,మినుము,సోయాచిక్కుడు,వేరుశెనగ,బెండ,ఉల్లి,బంగాళదుంప,క్యాబేజీ మరియు తేలిక నేలల్లో పెసర సారవంతమైన నేలల్లో సోయాచిక్కుడు ,మినుము వేసుకోవచ్చు.బోదెలను చదును చేసి,చెఱుకు నాటే రోజునే అంతరపంటలను బోదెల మీద వరుసల్లో నాటుకోవాలి(చాళ్ళ)మధ్య80-100 సెం.మీ ఎడం ఉన్నప్పుడు పెసర ,మినుము ,సోయాచిక్కుడు,వేరుశెనగ పంటలను రెండు వరుసలలో నాటుకోవాలి).పచ్చి రొట్ట నిచ్చే జీలుగ,జనుము విత్తనాలను పెడల మీద జల్లి,మొగ్గ దశలో పీకి చాళ్ళ మొక్కల మొదళ్ళలో వేసి మట్టి కప్పాలి.

పంటమార్పిడి:

మాగాణిలో,నేలల్లో చెఱుకు మొక్కతోట ,మొదటి కార్శితోట తర్వాత వారి,పెసర లేక మినుము పంటలను వేసి తదుపరి చెఱుకు సాగు చేయుట శ్రేష్టం.రెండు సంవత్సరాల కాలపరిమితిలో పెసర మినుము లేక వేరుశనగ తర్వాత చెఱుకు మొక్కతోట ,కార్షి మొత్తం మూడు పంటలు పండించటం లాభదాయకం.


కార్శితోటల సాగు:

రకాలు:


మొక్కతోతల కన్నా కార్శితోటలు త్వరగా పక్వానికి వస్తాయి.సాగులో ఖర్చు తక్కువ .మొక్క తోటలకంటే కార్శితోటలు మొదటి రోజుల్లో నీటి ఎద్దడి తట్టుకొంటాయి.పూతకురాని,తెగుల్లను తట్టుకొనే రకాలనుంచి కార్షి తోటలను సాగుచేయుట లాభాదాకం.కో 6907,కో8014,84ఎ125,81ఎ99,81వి48,85ఎ261,కోటి 8201,కోఎ7602,కో8021,86ఎ146,83ఆర్23,87ఎ298,83వి15,83వి288,86వి96 రకాలు మంచి కార్శితోటలనిస్తాయి.కార్షితోటల్లో దుబ్బులు మొలకేత్తేటప్పుడు కలుపు మందులను వాడరాదు.ల్తైన కాలవల్లో నాటిన మొక్క తోటలనుండి పెంచిన కార్షితోటలు అధిక దిగుబడులునిస్తాయి.పొలంలో పదును తక్కువగా ఉన్నప్పుడు,దుప్పులు కదలకుండా పదునైన పారలతో వరుసలలో ని మోళ్ళను చేక్కినపుడు భూమిలోపలి కణువులనుండి పిలకలు వస్తాయి.అవి సామాన్య గాలులకు పడిపోవు.

వరుసలలో 50సెం.మీ మించి ఖాళిలు వున్నపుడు,ఆరువారాల వయస్సుగల అదే రకపు (పాలిధీన్ సంచుల్లో పెంచిన)మొలకలతో ఖాళీలను నింపుకోవాలి.వరుసల మధ్య 15సెం.మీ లోతు దుక్కి చేయట౦ ద్వారా నేల పై చల్లిన్ చఱుకు చెత్త నేలలో కలపడమే కాకుండా మొదళ్ళ వద్దనున్న పాత వేర్లు తెగి ,క్రొత్త వేర్లు వచ్చి నీటిని ,పోషకాలను బాగా తీసికోనేందుకు అవకాశముంటుంది.

ఆయా ప్రాంతాలకు మొక్క తోటకు సిఫార్సు చేసిన నత్రజని కన్నా,అదనంగా ఎకరాకు 45 కిలోలు రెండు దఫాలుగా మోళ్ళు చెక్కిన వెంటనే ఒకసారి,45 రోజులకు మరోసారి వేయాలి.కార్షి చేసిన వెంటనే వరుసల మధ్య ఎకరాకు 1.25టన్నుల చెఱుకు చెత్తను కప్పి ,1.25కిలోల కుళ్ళబెట్టే శిలీంద్ర పొడిని (ఆస్పరిజిల్లస్ ఫ్లామ్=నిస్,పెన్సీలియం క్రిసోజీలం,కోచిలోబోలస్ స్పైసిఫెర్,రైజోపస్ ఒరైజే మరియు ట్రైకోడేర్మా విరిడి)పేడ నీళ్ళలో కలిపి చల్లాలి. -దీనితో' సహా 10కిలోల సూపరఫాస్పైట్,8కిలోల యూరియా కూడా చల్లితే ,భూమిలో తేమ నిలబడడమే కాకుండా చెత్త కప్పాలి.ఇనుప ధాతు లోపనివారణకు రెండు శాతం అన్నభేది ఎకరాకు 2కిలో 200 లీటర్లు నీటిలో కలిపి పైరు 45-60రోజుల వయస్సు ఉన్నపుడు రెండుసార్లు పిచికారి చేయాలి. ఎక్కువ పంచదార లేక బెల్లం పొందటానికి కార్శితోటలను 9-10 నెలలు పైబడినపుడు మాత్రమే నరకాలి.

మోళ్ళను చెక్కడం:


కార్షి తోటలో మోళ్ళను చెక్కడం: పొలంలో పదును తక్కువగా ఉన్నప్పుడు,దుప్పులు కదలకుండా పదునైన పారలతో వరుసలలోని మోళ్ళను చేక్కినపుడు భూమిలోపలి కణుపుల నుండి పిలకలు వస్తాయి.

చెత్త కప్పడం:


1.కార్షి చేసిన వెంటనే వరుసల మధ్య ఎకరాకు 1.25 కిలోల కుళ్ళబెట్టే శిలీంద్రాల పొడిని(ఆస్పరిజిల్లస్ ప్లానిస్,పెన్సీలియం క్రిసోజీలం,కోచిలోబోలస్ స్పైసిఫెర్,రైజోపస్ ఒరైజె మరియు ట్రైకోడేర్మా విరిడి)పేడ నీళ్ళలో కలిపి చల్లాలి. 2.దీనితో సహా10కిలోల సూపర్ ఫాస్పైట్,8కిలోల యూరియా కూడా చల్లితే,భూమిలో తేమ నిలబడడమే కాకుండా చెత్త బాగా చివికి ఎరువుగా ఉపయోగపడుతుంది.కలుపు మొక్కలు,పీక పురుగు వ్యాప్తి తగ్గుతుంది.

ఖాళీల నింపడం:


కార్షి తోటలో ఖాళీలను నింపడం: వరుసలలో 50సెం.మీ మించి ఖాళీలు వున్నప్పుడు ,ఆరు వారాల వయస్సుగల అదే రకపు(పాలిధీన్ సంచుల్లో పెంచిన)మొలకలతో ఖాళీలను నింపుకోవాలి.

ఎరువులు:


కార్షి తోటలలో ఎరువులు: ఆయా ప్రాంతాలకు మొక్క తోటకు సిఫార్సు చేసిన నత్రజని కన్నా,అదనంగా ఎకరాకు 45కిలోలు రెండు దఫాలుగా మోళ్ళు చెక్కిన వెంటనే ఒకసారి ,45 రోజులకు మరోసారి వేయాలి.

అంతర కృషి:


వరుసల మధ్య 15 సెం.మీ లోతు దుక్కి చేయటం ద్వారా నెల పై చల్లిన చెఱకు చెత్త నేలలో కలపడమే కాకుండా మొదళ్ళ వద్దనున్న పాత వేర్లు తెగి,క్రొత్త వేర్లు వచ్చి నీటిని ,పోషకాలను బాగా తీసికోనేందుకు అవకాశముంటుంది.ఎక్కువ పంచదార లేకబెల్లం పొందటానికి కార్శితోటలను 9-10నెలలు పైబడినప్పుడు మాత్రమే నరకాలి.


వాతావరణం:

ఎక్కువ సూర్యరశ్మి ,వర్షపాతం ,గాలిలో తేమ హెచ్చుగా వున్నపుడు చెఱుకు ఏపుగా పెరుగుతుంది.రాత్రి కన్నా పగటి వేళలు అధికంగా వుంటే(జూన్-జూలై)పెరుగుదలకు అనుకూలం.గాలిలో తక్కువగా తేమ చల్లటి పొడి వాతావరణం ఉంటె రసంలో పంచదార పెరుగుదలకు అనుకూలం,గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలకు మధ్య హెచ్చు వ్యత్యాసం(నవంబర్ నుండి మొదలవుతుంది.)ఉంటే పంచదార శాతం అధికమవుతుంది.


చౌడ భూముల్లో చెఱకు సాగు:

81వి48,కోటి8201,కో7219,81ఎ99,93ఎ145 రకాలను ఎన్నుకోవాలి.ఎకరాకు 18000 ముదురు మూడు కళ్ళ ముచ్చెలను పైపైనే నాటాలి.పాల చవుడు తీసివేయటానికి పొలాన్ని చైనా చిన్న మడులుగా చేసి మంచి నీటిలో నిలగట్టి,తర్వాత తీసివేయాలి.క్షార ఫ్యుములను ఈ క్రింద తెలిపిన ఉదజని సూచికననుసరించి జిప్సమ్ వాడి అభివృద్ధి పరచుకోవచ్చు.


నీటిముంపు పరిస్థితుల్లో చేఱకు సాగు:

నీటి ముంపు పరిస్థితుల్లో కనువైన రకాలను సాగుచేయాలి.భూమిని మెత్తగా గుల్లగా లోతు దుక్కి చేయాలి.నాటే సమయానికి ఆరకపోతే దమ్ము చేసి చాళ్ళ ఏర్పరిచి,దిబ్బాలపై చెఱకు ముచ్చెలు నాటాలి.నీటిముంపు ప్రాంతాల్లో చేఱకు నాట్లు జనవరి 15కు ముందుగానే నాటాలి.నత్రజనిని రెండు దఫాలుగా నాటిన ౩౦,60 వరోజున వేసుకోవాలి.భూమిని తయారుచేసేటపుడు 40సెం.మీలోతు ,60 సెం.మి వెడల్పు గల ఇవకతీత కాలువలను ఒక్కోక్కొకటి 24మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి.తోటల్లో నీరు నిల్వకుండా మురుగు నీటి కాల్వల ద్వారాగాని లేదా లిఫ్టు పంపులు వినియోగించి తరచుగా నీటిని తీసివేయాలి.మురుగునీటి ని తీసివేసిన తర్వాత భూమి ఆరినప్పుడు తోటలకు దగ్గర దగ్గర గా తడులు పెట్టాలి.నీటి ముంపుకు గురైన చెఱకు తోటలను వీలైనంత త్వరగా నరకాలి.ముంపుకు గురైన తోటల్లో తెల్లనల్లి నివారణకు మలాథియాన్ 3మి.లీ లేదా ఎండోసల్ఫాన్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.ముంపుకు గురైన తోటలను నరికి ఫ్యాక్టరీకి తోలడం గాని ,బెల్లం తయారీకి గాని ఉపయోగించాలి.