అంతర కృషి

విత్తిన ౩౦ రోజులకు గుంటక లేద దంతితో అంతర కృష చేయడం వలన పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి ,విత్తిన రెండు వారాల లోపుగా బత్తు మొక్కలు తీసివేయాలి.

కలుపు నివారణ

కలుపు నివారించే౦దుకు అట్రాజిన్ 50పొడి మందుని ఎకరాకు 800 గ్రా. చొప్పున 250 లీటరు నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2,3 రోజుల్లో పల పిచికారి చేయాలి.జొన్నమల్లె మొల కెత్తిన తర్వతా లీటరు నీటికి 50గ్రా.అమ్మోనియం సల్పేట్ను చేసి నివారించవచ్చు లేదా 2,4డి సోడియం సాల్ల్ 2గ్రా .లీటరు నీటికి కలిపి పిచికారి చేసి మల్లెను నివారించవచ్చు.జొన్న విత్తిన 35-40 రోజులకు జొన్నమల్లె మొల కెత్తుతు౦ది.